New Pensions in AP: ఏపీ ప్రజలకు శుభవార్త, కొత్త పెన్షన్ల ఎప్పటినుండి అప్లై చేసుకోవచ్చు అంటే…

New Pensions in AP: త్వరలోనే కొత్త పెన్షన్లు…

New Pensions in AP : ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్లు పెంచుతామనే మాట ప్రకారం మొదటి నెలలోనే పెంచిన ₹4000 పింఛన్‌తో పాటు ఏప్రిల్ నెల నుండే పెంచిన పింఛను అమలు చేసి ఆ బకాయి మొత్తం కూడా ఒకటే నెలలోనే పింఛన్ దారులకు అందజేసింది, వికలాంగుల పింఛన్‌ను ₹6000 చేసింది, డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న వారికి ₹10000, బెడ్ రిడెన్ వారికి ₹15000 ప్రతి నెల ఒకటో తారీఖు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా లబ్ధిదారులకు చేత ఇంటివద్దనే పింఛన్ అందేలా చేసింది. ఎవరైనా లబ్ధిదారులు ఒక నెల పింఛను తీసుకోకపోతే మరుసటి నెల రెండు పింఛన్లు కలిపి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించి, కొద్ది రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారూ ఈ అవకాశాన్ని మరో నెల పెంచుతూ ఎవరైనా లబ్ధిదారులు రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెల మొత్తం మూడు నెలలకు సంబంధించిన పింఛను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 64,00,000 కు పైగా వివిధ రకాల పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్ల ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారూ డిసెంబర్ నెల మొదటి వారం నుండి కొత్త NTR భరోసా పింఛన్లకు (New Pensions in AP) దరఖాస్తులు ప్రారంభిస్తామని తెలియజేశారు,ప్రజలు వారికీ దగ్గర్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు, కొత్త పింఛన్లకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేశారు. దాదాపు రాష్ట్రంలో ఐదు లక్షల మంది పెన్షన్లు దరఖాస్తు ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు వారందరికీ ఇది పెద్ద శుభవార్త అలాగే అనర్హులు కూడా భారీ స్థాయిలో ఉన్నారని వారి పైన కూడా విచారణ జరిపిస్తామని వెల్లడించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥రైతులకు 20 వేలు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఇస్తారు

పెన్షన్లు దరఖాస్తుకు కావలసిన డాక్యుమెంట్స్

ప్రభుత్వం New Pensions in AP ప్రకటించింది వాటికి కావాల్సిన పత్రాలు అన్ని సిద్ధం చేసుకోండి కింద తెలిపిన విధంగా పత్రాలు కావాలి.

  • ఆధార్ కార్డు
  • ఆధార్ హిస్టరీ
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • బియ్యం కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం

పైన తెలిపిన పత్రాలు అన్ని సిద్ధం చేసుకుని ప్రభుత్వం వారు ప్రకటించిన విధముగా డిసెంబర్ లో కొత్త పింఛన్లు దరఖాస్తు మొదలైతే మీ సచివాలయం లో దరఖాస్తు చేసుకోండి అధికారులు పరిశీలించి అర్హత ఉంటే పెన్షన్ మంజూరు చేస్తారు.

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

1 thought on “New Pensions in AP: ఏపీ ప్రజలకు శుభవార్త, కొత్త పెన్షన్ల ఎప్పటినుండి అప్లై చేసుకోవచ్చు అంటే…”

Leave a Comment

error: Content is protected !!